కూనపై కేసు.. ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు
ABN , First Publish Date - 2021-04-11T09:29:05+05:30 IST
టీడీపీ శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు, మాజీ విప్ కూన రవికుమార్పై పోలీసులు కేసు నమోదు చేశారు.
శ్రీకాకుళం, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): టీడీపీ శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు, మాజీ విప్ కూన రవికుమార్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల పొందూరు మండలం పెనుబర్తిలో టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీ నాయకులపై దాడులకు పాల్పడ్డవారిని రవికుమార్ వర్గం ప్రశ్నించేందుకు వెళ్లింది.
అదేసమయంలో అక్కడే ఉన్న పోలీసుల బలగాలను కూడా రవికుమార్ ప్రశ్నించారు. దీనిపై డీఎస్పీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రవికుమార్, అతని సోదరుడితోపాటు మరో 60 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం రవికుమార్ ఇంటిని పోలీసు బలగాలు చుట్టుముట్టాయి. తనిఖీల్లో రవికుమార్ ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులు వెనుదిరిగారు.