హెటిరోలో దొరికిన సొమ్మంతా జగన్దే
ABN , First Publish Date - 2021-10-15T06:49:04+05:30 IST
హెటిరోలో దొరికిన సొమ్మంతా సీఎం జగన్మోహన్రెడ్డిదేనని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆరోపించారు.
మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు విమర్శ
ఆర్థిక అసమానతలు పెరిగాయి: యనమల
ప్రత్తిపాడు, నర్సీపట్నం, అక్టోబరు 14: హెటిరోలో దొరికిన సొమ్మంతా సీఎం జగన్మోహన్రెడ్డిదేనని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం పెదశంకర్లపూడిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు గురువారం ప్రారంభించారు. అయ్యన్న మాట్లాడుతూ.. సీఎం జగన్ పాలనంతా దోపిడీమయంగా మారిందన్నారు. ఆదాయానికి మించి అప్పులు చేస్తున్నారని, రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని విమర్శించారు. జైలులో చిప్పకూడు తిన్నవాడికి పాలనపై అవగాహన ఏం ఉంటుందని నిలదీశారు. ‘రాష్ట్రంలో విద్యుత్ కష్టాలు మొదలయ్యాయి. విద్యుత్ చార్జీలు పెంచబోమని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్రెడ్డి రూ.37 వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపారు’ అని అన్నారు. యనమల మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు పెరిగాయని, పేదలకు ఇచ్చేది రూపాయి అయితే.. ప్రజలనుంచి వసూలు చేసేది రూ.2 అన్నారు.