ఒమన్లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం
ABN , First Publish Date - 2020-06-05T20:14:36+05:30 IST
ఒమన్లోని తమ్రైత్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు.
మస్కట్: ఒమన్లోని తమ్రైత్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మరణించారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. రెండు వాహనాలు ఒకదానొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ముగ్గురు ఒమన్ పౌరులు, ఒకరు వలసదారు ఉన్నట్లు ఒమన్ పోలీసులు వెల్లడించారు. రెండు వాహనాలు కెట్బెట్ వైపు వెళ్తున్న సమయంలో తమ్రైత్ వద్ద ఈ ప్రమాదం సంభవించింది. కాగా, గాయపడిన వ్యక్తిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.