సెమీస్లో నలుగురు భారత బాక్సర్లు
ABN , First Publish Date - 2021-04-20T10:52:00+05:30 IST
యూత్ బాక్సింగ్ వరల్డ్ చాంపియన్షి్పలో నలుగురు భారతీయులు సెమీస్ చేరారు. దీంతో ఈ నలుగురికీ పతకాలు ఖాయ మయ్యాయి.
కీల్స్ (పోలెండ్): యూత్ బాక్సింగ్ వరల్డ్ చాంపియన్షి్పలో నలుగురు భారతీయులు సెమీస్ చేరారు. దీంతో ఈ నలుగురికీ పతకాలు ఖాయ మయ్యాయి. 60 కిలోల క్వార్టర్స్ ఫైట్లో వింకా 5-0తో కామిలో (కొలంబియా)పై, 81 కిలోల ప్లస్ విభాగంలో ఆల్ఫియా 5-0తో హోప్మన్ (హంగేరి)పై, 57 కిలోల కేటగిరీలో పూనమ్ 5-0తో నాజర్కీ సెరిక్ (కజకిస్థాన్)పై నెగ్గి సెమీస్ చేరారు. అలాగే 48 కిలోల విభాగంలో గీతిక కూడా పతకం ఖాయం చేసుకుంది.