విద్యుదాఘాతంతో నలుగురి మృతి

ABN , First Publish Date - 2021-01-10T07:56:56+05:30 IST

విద్యుదాఘాతంతో రెండు కుటుంబాలకు చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు.

విద్యుదాఘాతంతో నలుగురి మృతి

  • ఒకరిని కాపాడే ప్రయత్నంలో మరొకరు
  • మానుకోట జిల్లాలో రెండు జంటల మృత్యువాత


మహబూబాబాద్‌, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): విద్యుదాఘాతంతో రెండు కుటుంబాలకు చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు. మహబూబాబాద్‌ జిల్లాలో శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో చనిపోయిన నలుగురిలో రెండు జంటలు ఉండటం విషాదకరం. మృతులు మహబూబాబాద్‌ మండలం అమనగల్‌కు చెందిన రైతు దంపతులు చెన్నబోయిన సత్తయ్య(52), రాధమ్మ(48)తో పాటు దాసరి లింగయ్య(55) లక్ష్మి (50). సత్తయ్య శనివారం రాత్రి స్నానం చేసి దుస్తులను ఆరు బయట ఉన్న జియో వైరుపై ఆరవేస్తుండగా విద్యుదాఘాతానికి గురై కేకలు వేశాడు.


భర్తను రక్షించే క్రమంలో అతడి భార్య రాధమ్మ కూడా విద్యుదాఘాతానికి గురైంది. ఇరువురి కేకలు విన్న ఎదురింట్లో ఉండే దాసరి లింగయ్య, లక్ష్మి దంపతులు వారిని కాపాడేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే అందరూ అక్కడే కుప్పకూలారు. మొదట విద్యుదాఘాతానికి గురైన సత్తయ్య, రాధమ్మ అక్కడికక్కేడే మృతి చెందగా.. తీవ్ర అస్వస్థతకు గురైన దాసరి లింగయ్య, లక్ష్మిలను మహబూబాబాద్‌ జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి హామీ ఇచ్చారు.

Updated Date - 2021-01-10T07:56:56+05:30 IST