గొర్రెల కాపరులను బెదిరించిన నలుగురి అరెస్టు
ABN , First Publish Date - 2021-04-14T06:07:43+05:30 IST
గొర్రెల కాపరులను బెదిరించిన నలుగురి అరెస్టు
నందివాడరూరల్(గుడివాడ) : పోలీసులమంటూ గొర్రెల కాపరులను బెదిరించి నాలుగు గొర్రెలు తీసుకున్న నలుగురుని పోలీ సులు అరెస్టు చేశారు. గొర్రెల కాపరులు తాము మోసపోయామని గుర్తించి జొన్నపాడు నైట్ బీట్లో ఉన్న కానిస్టేబుళ్లకు సోమవారం రాత్రి ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు రూరల్ సీఐ అబ్దుల్ నబీ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు అధికార పార్టీ నాయకుల అనుచరులు కావడంతో కేసు నుంచి తప్పించేందుకు కొందరు రంగంలోకి దిగినట్లు సమాచారం.