‘దొండపాటి’ హత్య కేసులో మరో నలుగురి అరెస్టు
ABN , First Publish Date - 2021-03-06T05:55:18+05:30 IST
వైసీపీ నాయకుడు, ఆదిత్య కనస్ట్రక్షన్స్ అధినేత దొండపాటి శ్రీనివాస్ హత్య కేసులో మరో నలుగురిని ధవళేశ్వరం పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.
ధవళేశ్వరం, మార్చి 5: వైసీపీ నాయకుడు, ఆదిత్య కనస్ట్రక్షన్స్ అధినేత దొండపాటి శ్రీనివాస్ హత్య కేసులో మరో నలుగురిని ధవళేశ్వరం పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ప్రధాన నిందితులకు సహకరించిన బొమ్మూరుకు చెందిన దాసరి రాజ్కుమార్, యర్రంశెట్టి రమేష్ అలియాస్ శ్రీరామ్, దివాన్చెరువుకు చెందిన కోన నాగదుర్గవరప్రసాద్, నామవరానికి చెందిన రెడ్డి శివనాగదుర్గారావు అలియాస్ దుర్గలను అరెస్టు చేసినట్టు ధవళేశ్వరం సీఐ అడబాల శ్రీను చెప్పారు.