సీఆర్‌పీఎఫ్‌లో మరో నలుగురికి కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2020-05-26T00:43:49+05:30 IST

దేశ రాజధానిలో సీఆర్‌పీఎఫ్‌కు చెందిన మరో నలుగురు కోవిడ్-19 బారిన పడ్డారు. వీరికి కరోనా పాజిటివ్ అని..

సీఆర్‌పీఎఫ్‌లో మరో నలుగురికి కరోనా పాజిటివ్

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో సీఆర్‌పీఎఫ్‌కు చెందిన మరో నలుగురు కోవిడ్-19 బారిన పడ్డారు. వీరికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఇంతవరకూ కరోనా వైరస్ బారిన పడిన వారి (సీఆర్‌పీఎఫ్) సంఖ్య 363కు చేరింది. వీటిలో 220 యాక్టివ్ కేసులు ఉండగా, ఇద్దరు మృతి చెందినట్టు సీఆర్‌పీఎఫ్ అధికారులు తెలిపారు.


కాగా, ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య సోమవారంనాడు 14,053కు చేరినట్టు రాష్ట్ర ప్రభుత్వ హెల్త్ బులిటెన్ తెలిపింది. వీటిలో 7,006 యాక్టివ్ కేసులు ఉండగా, 6,771 మంది పేషెంట్లకు స్వస్థత చేకూరింది. మృతుల సంఖ్య 276కు చేరింది. 50కి పైగా పడకలు ఉన్న అన్ని ప్రైవేటు నర్సింగ్ హోమ్‌లు, ఆసుపత్రుల్లో కోవిడ్ పేషెంట్ల కోసం 20 శాతం పడకలు రిజర్వ్ చేయాలని ఢిల్లీ సర్కార్ ఇప్పటికే ఆదేశించింది. ప్రస్తుతం ఢిల్లీలో 88 కంటోన్మెంట్ జోన్లు ఉన్నాయి.

Updated Date - 2020-05-26T00:43:49+05:30 IST