నలుగురు దొంగల అరెస్ట్
ABN , First Publish Date - 2021-03-31T00:07:58+05:30 IST
వాహనాలను తస్కరిస్తున్న నలుగురు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు.
మెదక్: వాహనాలను తస్కరిస్తున్న నలుగురు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమంగా గుట్కా రవాణా చేస్తున్న వాహనాన్ని వీరు దొంగిలించారు. తాము చోరీ చేసిన వాహనంతో వెళుతుండగా ఈ నలుగురు దొంగలను చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.6.50 లక్షలు, 19 గుట్కా బస్తాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.