ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-07-01T00:12:00+05:30 IST
జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. జి.సిగడాం మండలంలోని జగన్నాథవలసలో
శ్రీకాకుళం: జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. జి.సిగడాం మండలంలోని జగన్నాథవలసలో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. బావిలో దూకి తల్లి, ఇద్దరు కూతుర్లు, కుమారుడు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను తల్లి భోగేశ్వరి, పిల్లలు చక్రి, జయలక్ష్మి, భారత్కుమార్గా గుర్తించారు. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్టు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.