ఆన్‌లైన్ లోన్‌లో మోసం: మహిళా ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2021-01-16T23:59:50+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఇందిరాకాలనీలో ఆన్‌లైన్ లోన్ అంశంలో మోసపోయి దగాపడడంతో ఓ వివాహిత

ఆన్‌లైన్ లోన్‌లో మోసం: మహిళా ఆత్మహత్యాయత్నం

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఇందిరాకాలనీలో ఆన్‌లైన్ లోన్ అంశంలో మోసపోయి దగాపడడంతో ఓ వివాహిత ఆత్మహత్యాయత్నం చేసింది. ఆన్‌లైన్ లోన్స్ పేరిట రూ.3లక్షలు రుణం ఇప్పిస్తామంటూ ఫోన్లో నమ్మించి.. కేటుగాళ్లు రూ.52వేలు స్వాహా చేశారు. రూ.3లక్షల లోన్ వస్తుందన్న ఆశతో భర్తకు తెలియకుండా అప్పుచేసి మరీ కట్టింది. తీరా మోసపోయానన్న సంగతి తెలిసి ఇంట్లో శానిటైజర్, డెటాల్ తాగి వివాహిత మేఘన ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ సభ్యులు ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-01-16T23:59:50+05:30 IST