వ్యవసాయ యంత్రాల పేరుతో ఘరానా మోసం
ABN , First Publish Date - 2021-07-24T02:24:56+05:30 IST
జిల్లాలోని వ్యవసాయ యంత్రాల పేరుతో రైతులను మోసం చేసిన ఘటన వెలుగులోకి
నాగర్ కర్నూలు: జిల్లాలోని వ్యవసాయ యంత్రాల పేరుతో రైతులను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. కల్వకుర్తిలో వ్యవసాయ యంత్రాల పేరుతో రైతులను ఓ వ్యాపారి ఘరానా మోసం చేశాడు. రైతులవద్ద ఒక్కొక్కరి నుంచి రూ.5 లక్షలకు పైగా వసూలు చేశాడు. రైతులకు నకిలీ యంత్రాలను వ్యాపారి అంటగట్టాడు. విషయం బయటకు రావడంతో యజమాని పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.