అమ్మాయిని ఎరవేసి లక్షలు కొట్టేశారు..!

ABN , First Publish Date - 2021-05-18T12:17:44+05:30 IST

పెళ్లి చేసుకుందామంటూ ముగ్గులోకి దింపింది

అమ్మాయిని ఎరవేసి లక్షలు కొట్టేశారు..!

హైదరాబాద్/హిమాయత్‌నగర్‌ : ఓ మ్యాట్రిమోనీ సంస్థ ద్వారా వివరాలు తీసుకుని నగరానికి చెందిన యువకుడికి అమ్మాయిని ఎరవేసిన సైబర్‌ కేటుగాళ్లు అతడి నుంచి రూ.రెండు లక్షలకు పైగా కాజేశారు. సైబర్‌క్రైమ్స్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ వివరాల ప్రకారం మెట్టుగూడకు చెందిన విక్రమ్‌ అనే యువకుడికి ఇటీవల ఓ విదేశీ ఫోన్‌ నెంబర్‌ నుంచి కాల్‌ వచ్చింది. తన పేరు పమేలా బిందే అని, యూకేలో స్థిరపడిన ఎన్నారై కుటుంబం అంటూ నమ్మించింది. నీకు అంగీకారమైతే ఇద్దరం పెళ్లి చేసుకుందామంటూ ముగ్గులోకి దింపింది, పెళ్లి కూడా ఇండియాలోనే చేసుకుందామని, ఖర్చులు, ఇతరత్రా కోసం రూ. కోట్లలో డబ్బు చెక్కు ద్వారా పంపిస్తానని నమ్మించింది. ఆ తర్వాత ఎయిర్‌పోర్టు నుంచి కస్టమ్స్‌ అధికారులమంటూ ఫోన్‌ చేసి యువకుడి నుంచి రెండు దఫాలుగా రెండు లక్షలకు పైగా డబ్బును ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్నారు. ఫోన్లు స్విచ్చాఫ్‌ వస్తుండటంతో మోసపోయానని గ్రహించిన యువకుడు సైబర్‌క్రైమ్స్‌లో ఫిర్యాదు చేశాడు.

Updated Date - 2021-05-18T12:17:44+05:30 IST