కరోనా మందులు పంపుతామంటూ మోసాలు

ABN , First Publish Date - 2021-06-22T09:18:23+05:30 IST

ప్రాణాపాయ స్థితిలో ఉన్న కొవిడ్‌ రోగులకు అందించే అత్యవసర మందులను విక్రయిస్తామంటూ డబ్బులు తీసుకుని మోసాలకు పాల్పడుతున్న ఇద్దరిని రాచకొండ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

కరోనా మందులు పంపుతామంటూ మోసాలు

ఇద్దరిని అరెస్ట్‌ చేసిన రాచకొండ పోలీసులు

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): ప్రాణాపాయ స్థితిలో ఉన్న కొవిడ్‌ రోగులకు అందించే అత్యవసర మందులను విక్రయిస్తామంటూ డబ్బులు తీసుకుని మోసాలకు పాల్పడుతున్న ఇద్దరిని రాచకొండ పోలీసులు అరెస్ట్‌ చేశారు. తూర్పు గోదావరి గుడిముల్ల కండ్రిక ప్రాంతానికి చెందిన గునిశెట్టి రాజ్‌కుమార్‌ రావ్‌(34)కర్నూలు జిల్లా డోన్‌కు చెందిన సందు దివాకర్‌తో కలిసి మోసాలు చేయడం ప్రారంభించాడు. వీరిద్దరూ కలిసి కుప్పంలో ఓ లాడ్జ్‌ తీసుకున్నారు. రెమ్‌డెసివిర్‌, బ్లాక్‌ ఫంగస్‌ మందు లు, ఆక్సిజన్‌ విక్రయిస్తామంటూ మోసం చేస్తున్నారు. ఇదే తరహాలో నగరానికి చెందిన ఓ వ్యక్తి నుంచి రూ.1.02 లక్షలు కాజేశారు. అతడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న రాచకొండ పోలీసులు నిందితులను గుర్తించి అరెస్ట్‌ చేశారు.

Updated Date - 2021-06-22T09:18:23+05:30 IST