తిరుమలలో ఉచిత దర్శనాలను అనుమతించాలి
ABN , First Publish Date - 2021-08-27T00:51:47+05:30 IST
తిరుమలలోని శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఉచిత దర్శనాలను అనుమతించాలని టీటీడీ
విశాఖపట్నం: తిరుమలలోని శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఉచిత దర్శనాలను అనుమతించాలని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి విశాఖ పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి సూచించారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రిషికేష్లో చాతుర్మాస్య దీక్షలో ఉన్న స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్రలను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్కు స్వరూపానందేంద్ర పలు సూచనలు చేశారు. తిరుమలలో ఉచిత దర్శనాలను అనుమతించాలన్నారు. హిందూ ధర్మ ప్రచారాన్ని నూతన పంథాలో చేపట్టాలన్నారు. ఉన్నత ఆలోచనలతో పనిచేసే అధికారులను ఆలయాలకు ఈవోలుగా నియమించాలని సూచించారు. ఖాళీగా ఉన్న వేదపారాయణదారుల పోస్టులను టీటీడీ భర్తీ చేయాలన్నారు. పురాతన ఆలయాల జీర్ణోద్ధరణకు సైతం టీటీడీ కృషి చెయ్యాలని టీటీడీకి స్వరూపానందేంద్ర సూచించారు.