ఉచిత విద్యుత్ను యథావిధిగా కొనసాగించాలి
ABN , First Publish Date - 2020-10-25T11:10:44+05:30 IST
వైసీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను సర్వ నాశనం చేస్తుందని, రైతుల పక్షపాతి అని చెప్పుకునే వైసీపీ అధినేత, ము ఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతులకు ఇస్తున్న ..
దెందులూరు, అక్టోబరు 24 : వైసీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను సర్వ నాశనం చేస్తుందని, రైతుల పక్షపాతి అని చెప్పుకునే వైసీపీ అధినేత, ము ఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్ మోటార్లకు మీటర్లను ఎందుకు బిగిస్తున్నారో చెప్పాలని, అసెంబ్లీ సాక్షిగా అమరావతికి మద్దతు పలికిన జగన్మోహనరెడ్డి ఎందుకు మాట తప్పారో చెప్పాలని జిల్లా తెలుగు యువత నేత, దెందులూరు నియోజకవర్గ బీసీ సంఘం కార్యదర్శి వేమన రాముగౌడ్ ప్రభుత్వాన్ని విమర్శించారు.
శనివారం చల్లచింతలపూడి లోని మాజీ ఎంపీటీసీ వేమన వెంకటేశ్వరమ్మ నివాసంలో గ్రామపార్టీ అధ్య క్షుడు రోఖ్ఖం మాధవ్, మండల పార్టీ కార్య దర్శి నాగనబోయిన సత్య నారాయణ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసంద ర్భంగా రాముగౌడ్ మాట్లాడుతూ రైతులకు అందిస్తున్న ఉచిత విద్యుత్ను యఽథావిధిగా కొనసాగిస్తూ నగదు బదిలీ పథకాన్ని రద్దు చేయాలన్నారు. పార్టీ నాయకులు సింహాద్రి శ్రీమనారాయణ, రైతు సంఘంనేత ఉప్పాల పాటి నరేశ్, జనసేన నాయకుడు బొల్లా రాజేశ్, మొదుగు మూడి శ్రీను, నంభూరి శ్రీను, మొదుగుమూడి వెంకటరాజు, తదితరులు పాల్గొన్నారు.