త్వరలో రైతులు, హమాలీలకు ఉచిత భోజనం : ఎమ్మెల్సీ కవిత

ABN , First Publish Date - 2021-06-13T05:13:40+05:30 IST

నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌కు వచ్చే రైతులు, హమాలీలకు త్వరలో ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని ప్రార ంభించనున్నట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. శనివారం మార్కెట్‌ యార్డ్‌లో హమాలీ యూనియన్‌ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

త్వరలో రైతులు, హమాలీలకు ఉచిత భోజనం : ఎమ్మెల్సీ కవిత
మార్కెట్‌లో స్థలాన్ని పరిశీలిస్తున్న కవిత

నిజామాబాద్‌అర్బన్‌, జూన్‌ 12: నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌కు వచ్చే రైతులు, హమాలీలకు త్వరలో ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని  ప్రార ంభించనున్నట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. శనివారం మార్కెట్‌ యార్డ్‌లో హమాలీ యూనియన్‌ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిజామాబాద్‌ ప్ర భుత్వ ఆసుపత్రిలో అన్నదానం కొనసాగుతున్న విధంగానే మార్కెట్‌ యార్డ్‌ లోనూ త్వరలో ప్రారంభిస్తామన్నారు. రైతన్నలకు వెన్నుదన్నుగా ఉండే హ మాలీ కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభు త్వం కార్మికుల పక్షపాతి అన్నారు. కార్మికుల సమస్యలను ఎల్లవేళలా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని, తన సొంత నిధులతో ఉచిత భోజన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం ఆమె ఉచిత భోజన కార్యక్రమాన్ని నిర్వహించే స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌, మేయర్‌ నీతూ కిరణ్‌, నుడా చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-13T05:13:40+05:30 IST