కరోనా బాధితులకు ఉచితంగా భోజనం !

ABN , First Publish Date - 2020-08-09T09:03:55+05:30 IST

కరోనా బాధితులను కన్నవారు, చుట్టుపక్కల వారు కనీస మానవత్వం మరిచి దూరం పెడుతున్న ఈ రోజుల్లో ఓ స్వచ్ఛంద సంస్థ ‘మేమున్నాం మీకోసం’ అంటూ వారికి వెన్నుదన్నుగా నిలుస్తోంది...

కరోనా బాధితులకు ఉచితంగా భోజనం !

  • ఇళ్ల వద్దకే పంపిణీ.. ‘మేమున్నాం మీకోసం’ దాతృత్వం 


కరీంనగర్‌, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కరోనా బాధితులను కన్నవారు, చుట్టుపక్కల వారు కనీస మానవత్వం మరిచి దూరం పెడుతున్న ఈ రోజుల్లో ఓ స్వచ్ఛంద సంస్థ ‘మేమున్నాం మీకోసం’ అంటూ వారికి వెన్నుదన్నుగా నిలుస్తోంది. ఫోన్‌ చేస్తే చాలు వారికి ఉచితంగా భోజనం అందిస్తోంది. కరీంనగర్‌లోని ‘మేమున్నాం మీకోసం’ స్వచ్ఛంద సంస్థ కరోనా సోకి ఇళ్లలోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్న వారికి ఉచితంగా భోజనం అందిస్తూ తన సేవాగుణాన్ని చాటుకుంటున్నది. ఎంతమంది కోరితే అంతమందికి భోజనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, అవసరమైన వారు 9000454141కు ఫోన్‌ చేయాలని రాజేందర్‌ సూచించారు. 


Updated Date - 2020-08-09T09:03:55+05:30 IST