రేపటి నుంచి ఉచిత రేషన్ పంపిణీ
ABN , First Publish Date - 2020-07-02T09:33:48+05:30 IST
ఈ నెల మూడో తేదీ నుంచి చౌక డిపోల్లో బియ్యం కార్డుదారులకు బియ్యం, కందిపప్పు ఉచితంగా అందజేస్తున్నట్టు రూరల్ డీఎస్వో
విశాఖపట్నం, జూలై 1(ఆంధ్రజ్యోతి): ఈ నెల మూడో తేదీ నుంచి చౌక డిపోల్లో బియ్యం కార్డుదారులకు బియ్యం, కందిపప్పు ఉచితంగా అందజేస్తున్నట్టు రూరల్ డీఎస్వో ఆర్.శివప్రసాద్ తెలిపారు. అయితే అరకిలో పంచదారకు రూ.17 చెల్లించాలన్నారు. అంత్యోదయ కార్డుదారులకు కిలో పంచదార రూ.13.50లు చెల్లించాలన్నారు.