స్వాతంత్య్ర సమరయోధుడు బట్టు పంతులు మృతి

ABN , First Publish Date - 2021-10-24T06:45:26+05:30 IST

మండలంలో ని జానకినగర్‌ గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు, రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు బట్టు పంతులు(88) శనివారం మృతిచెందారు.

స్వాతంత్య్ర సమరయోధుడు బట్టు పంతులు మృతి
పంతులు(ఫైల్‌)

చిలుకూరు, అక్టోబరు 23: మండలంలో ని జానకినగర్‌ గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు, రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు బట్టు పంతులు(88) శనివారం మృతిచెందారు. ఆయనకు ఇద్దరు కుమారులు కాగా, పెద్ద కుమారుడు బట్టు రమేష్‌ తెలుగు యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా, మరో కుమారుడు బట్టు శ్రీనివాస్‌ బీడీఎల్‌ సీనియర్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. కాగా, ఆయన మృతిపై స్వాతంత్య్ర సమరయోధుడు దొడ్డా నారాయణరావు, ఎస్టీయూ ఉపాధ్యాయ సంఘ నాయకులు కొండా వెంకయ్య, ఎలగొండ శ్రీను, మందా పుల్లయ్య, కె.వెంకటేశ్వర్లు, బట్టు వెంకటేశ్వర్లు, శివాజీ, లాలు, తిరుమల్‌, సైదానాయక్‌, తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-10-24T06:45:26+05:30 IST