స్వాతంత్ర సమరయోధురాలు జయమ్మ మృతి
ABN , First Publish Date - 2021-06-23T06:31:04+05:30 IST
మండల కేంద్రానికి చెందిన స్వాతంత్ర సమరయోధురాలు గరిణె జయమ్మ(90) మంగళవారం మృతి చెందారు.
చిలుకూరు, జూన్ 22 : మండల కేంద్రానికి చెందిన స్వాతంత్ర సమరయోధురాలు గరిణె జయమ్మ(90) మంగళవారం మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఆమె బాధపడుతున్నారు. జమమ్మకు ఇద్దరు కుమారులు. వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. జమమ్మ మృతికి దొడ్డా నారాయణరావు, ఎంపీపీ ప్రశాంతి కోటయ్య, జడ్పీటీసీ శిరీషానాగేంద్రబాబు, సర్పంచ్ కొడారి బాబు, ఎంపీటీసీలు రమణ నాగయ్య, కల్యాణికోటేష్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు రామారావు, ధనమూర్తి, అలసకాని వెంకటయ్య, నాగయ్య, పుల్లారావు, వివిధ పార్టీల నాయకులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.