ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ సేవలు ప్రశంసనీయం

ABN , First Publish Date - 2021-06-18T03:55:56+05:30 IST

కరోనా రెండో దశ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్యం కోసం వైద్య, పోలీసు, మున్సిపల్‌ సిబ్బంది అందించిన సేవ లు ప్రశంసనీయమని రామగుండం సీపీ సత్యనారా యణ పేర్కొన్నారు. కల్వకుంట్ల మాధవరావు ట్రస్టు ఆధ్వర్యంలో పోలీస్‌స్టేషన్‌లో వైద్య, మున్సిపల్‌, పోలీసు సిబ్బందికి శానిటైజర్లు, మాస్కులు, డ్రైఫ్రూట్స్‌ పంపిణీ కార్యక్రమానికి గురువారం సీపీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ సేవలు ప్రశంసనీయం
మాట్లాడుతున్న రామగుండం సీపీ సత్యనారాయణ

 మందమర్రిటౌన్‌, జూన్‌ 17: కరోనా రెండో దశ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్యం కోసం వైద్య, పోలీసు, మున్సిపల్‌ సిబ్బంది అందించిన సేవ లు ప్రశంసనీయమని రామగుండం సీపీ సత్యనారా యణ పేర్కొన్నారు. కల్వకుంట్ల మాధవరావు ట్రస్టు ఆధ్వర్యంలో పోలీస్‌స్టేషన్‌లో వైద్య, మున్సిపల్‌, పోలీసు సిబ్బందికి శానిటైజర్లు, మాస్కులు, డ్రైఫ్రూట్స్‌ పంపిణీ కార్యక్రమానికి గురువారం సీపీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా కరోనా కట్టడి కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పనిచేస్తున్నారని తెలిపారు. ప్రస్తుత ప్రమాదకర పరిస్థితుల్లో పోలీసులు ప్రజల రక్షణ కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేశారని తెలిపారు.  కరోనా కేసులు తగ్గుము ఖం పట్టినప్పటికీ మాస్కులు ధరించాలని, శానిటైజ ర్లను వాడాలని పేర్కొన్నారు.  ట్రస్టు సభ్యులు మాస్కు లు, శానిటైజర్లు, డ్రైఫ్రూట్స్‌ పం పిణీ చేయడం సంతో షంగా ఉందన్నారు. డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి,  ఏసీ పీ రహెమాన్‌, సీఐ ప్రమోద్‌రావు, ట్రస్టు నిర్వాహ కులు సందీప్‌రావు, ఎస్‌ఐ భూమేష్‌  పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-18T03:55:56+05:30 IST