హామీలు నెరవేర్చండి
ABN , First Publish Date - 2022-01-25T04:30:25+05:30 IST
ఎన్నికల సమయంలో మున్సిపల్ కార్మికులను ఇచ్చిన హమీలన్నీ నెరవేర్చాలని మున్పిపల్ కార్మికులు డిమాండు చేశారు.
నిరసన ప్రదర్శనలో మున్సిపల్ కార్మికులు
ప్రొద్దుటూరు, జనవరి 24 : ఎన్నికల సమయంలో మున్సిపల్ కార్మికులను ఇచ్చిన హమీలన్నీ నెరవేర్చాలని మున్పిపల్ కార్మికులు డిమాండు చేశారు. ఈ మేరకు సోమవారం సీఐటీయూ అనుబంధ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వార్డు సచివాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా జీవో నెంబరు 7 ప్రతులను దహనం చేశారు. ఆ సంఘం జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు విజయకుమార్, పట్టణ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు చంటి, సాల్మోన్లు మాట్లాడుతూ జీవో 15, 16లను అమలు చేయాలన్నారు. కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే ఫిబ్రవరి 7వ తేదీ తర్వాత నిరవధిక సమ్మెకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ రమణమ్మ, కోశాధికారి రాఘవేంద్ర, ఉపాధ్యక్షులు గురమ్మ, రమాదేవి, నీలిమ, నరసమ్మ, మున్పిపల్ కార్మికులు పాల్గొన్నారు.