సర్వ సన్నద్ధమైన భారత వాయుసేన

ABN , First Publish Date - 2020-07-05T14:01:01+05:30 IST

తూర్పు లడఖ్ ప్రాంతంలో చైనాతో జరుగుతున్న సరిహద్దు ఉద్రిక్తత దృష్ట్యా భారత వైమానిక దళం సర్వ సన్నద్ధమైంది

సర్వ సన్నద్ధమైన భారత వాయుసేన

న్యూఢిల్లీ : తూర్పు లడఖ్ ప్రాంతంలో చైనాతో జరుగుతున్న సరిహద్దు ఉద్రిక్తత దృష్ట్యా భారత వైమానిక దళం సర్వ సన్నద్ధమైంది. ఫ్రంట్‌లైన్ జెట్లు, వైమానిక దాడిలో వినియోగించే హెలికాపర్లను, రవాణాకు సంబంధించిన విమానాలను వాస్తవ నియంత్రణ రేఖ వెంట గగన తలంలో కాపలాగా ఉంచుతోంది. రవాణాకు వినియోగించే అమెరికన్ సి-17 తో పాటు సి-130జె, రష్యాకు చెందిన ఇల్యూచిన్-76, ఆంటోనోవ్ -32 లాంటి వాటిల్లో దళాలను, సామాగ్రిని రవాణా చేయడానికి ఇప్పటికే వాయుసేన మోహరించింది. అపాచీ యుద్ధం విమానమైతే నిరంతరం గస్తీ కాస్తూనే ఉంది.


ఈ స్థావరం మొత్తం కూడా కార్యకలాపాలను పర్యవేక్షించడం, జవాన్ల సంసిద్ధతను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు తెలిపారు. ‘‘ఈ ప్రాంతంలో కార్యకలాపాలను నిర్వహించడంలో ఈ స్థావరం చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఈ స్థావరం ఎలాంటి ఆకస్మిక చర్యలను చేపట్టడానికైనా, పోరాటం చేయడానికైనా సర్వ సన్నద్ధంగా ఉంది’’ అని ఓ ఉన్నతాధికారి ప్రకటించారు. ఎలాంటి ఆపరేషన్లను చేయడానికైనా భారత వాయుసేన సర్వ సన్నద్ధంగానే ఉందని, ప్రస్తుత పరిస్థితుల్లో, యుద్ధ సమయాల్లో వాయుసేన చాలా ప్రముఖమైందని ఆయన అన్నారు. 

Updated Date - 2020-07-05T14:01:01+05:30 IST