క్రీడలతో మానసికోల్లాసం

ABN , First Publish Date - 2022-01-28T05:44:48+05:30 IST

క్రీడలు మానసికోల్లాసాన్ని కలిగిస్తాయని జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్‌రావు అన్నారు.

క్రీడలతో మానసికోల్లాసం
బహుమతులు ప్రదానం చేస్తున్న జడ్పీటీసీ, ఎంపీపీ

- జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్‌రావు

ఆసిఫాబాద్‌, జనవరి 27: క్రీడలు మానసికోల్లాసాన్ని కలిగిస్తాయని జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్‌రావు అన్నారు.  రహపల్లి ఆమ్రంలో  నాలుగు రోజుల నుంచి జరుగుతున్న కబడ్డీ పోటీల్లో విజేతలకు గురువారంఎంపీపీ మల్లికార్జున్‌తో కలిసి బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు శారీరక దారుఢ్యాన్ని పెంచుతాయని, క్రీడల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ఇటువంటి టోర్నమెంట్‌లు పని చేస్తాయని తెలిపారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ మంగ, పీఏసీఎస్‌ చైర్మన్‌ అలీబీన్‌ అహ్మద్‌, సర్పంచ్‌లు శ్రీనివాస్‌, భీమేష్‌, కౌన్సిలర్‌ ప్రభాకర్‌, నాయకులు శ్రీనివాస్‌, పెంటయ్య, కిష్టయ్య, ప్రహ్లద్‌, నిర్వహకులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-28T05:44:48+05:30 IST