ప్రైవేట్‌ టీచర్ల కోసం భిక్షాటన

ABN , First Publish Date - 2021-01-18T05:09:08+05:30 IST

ప్రైవేట్‌ టీచర్ల కోసం భిక్షాటన

ప్రైవేట్‌ టీచర్ల కోసం భిక్షాటన
భిక్షాటన చేస్తున్న షబ్బీర్‌ అలీ

 మరిపెడ, జనవరి 17 : కరోనా కష్టకాలం లో ప్రభుత్వాలు ప్రైవేట్‌ టీచర్లను పట్టించు కోలేదని టీపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు షేక్‌ షబ్బీ ర్‌ ఆలీ ఆరోపించారు. ఆదివారం ప్రైవేట్‌ టీచ ర్ల ఆధ్వర్యంలో  మండలకేంద్రంలోని షాపుల లో భిక్షాటన చేశారు. లలిత నర్సింగ్‌ హోం నిర్వాహకులు ప్రైవేట్‌ టీచర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ప్రైవేట్‌ పాఠశాలల యజమాన్యాలు జీతాలు చెల్లించక పోవ డంతో టీచర్ల పరిస్థితి అధ్వానంగా మారిందని, దీంతో వారిలో చాలా మంది ఆత్మ హ త్యల కు పాల్పడ్డారని వాపోయారు. టీపీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బయ్యా శివరాజ్‌,  రాంచంద్ర య్య, సైదులు, శేఖర్‌, మోమిన్‌, క్రాంతి కుమార్‌, ఖాదీర్‌, మధు, యాకయ్య పాల్గొన్నారు.


Updated Date - 2021-01-18T05:09:08+05:30 IST