ప్రజలు కట్టిన పన్నుల నుంచే నిధులు: ఈటల
ABN , First Publish Date - 2021-10-13T23:42:27+05:30 IST
ప్రజలు కట్టిన పన్నుల నుంచి నిధులు వస్తున్నాయని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
జమ్మికుంట: ప్రజలు కట్టిన పన్నుల నుంచి నిధులు వస్తున్నాయని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పెన్షన్, రేషన్ కార్డు, ప్రభుత్వ పథకాల లబ్ధి పొందే వారందరూ టీఆర్ఎస్కు ఓటు వేయాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారని ఈటల విమర్శించారు. ఇవన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటి నుంచి, ఆయన సొంత భూమి అమ్మి, కూలీ పని చేసి ఇచ్చినట్లుగా మాట్లాడటం సరికాదన్నారు. ప్రజలు కట్టిన పన్నుల నుంచే నిధులు, పథకాలు ఇస్తున్నారని గుర్తుంచుకోవాలన్నారు. కేసీఆర్ కేవలం కాపాలాదారుడు మాత్రమే అన్నారు. తనను ఓడించడానికే డబ్బులు ఇస్తున్నారని, ప్రజల మీద ప్రేమతో కాదన్నారు. హుజూరాబాద్, జమ్మికుంటలో జెండా, ఫ్లెక్సీ కట్టడానికి కూడా పర్మిషన్ ఇవ్వడం లేదని ఈటల రాజేందర్ ఆరోపించారు.