ఆశ్రునయనాల మధ్య చిన్నారుల అంత్యక్రియలు

ABN , First Publish Date - 2021-05-11T05:28:00+05:30 IST

పాణ్యం మండలం సుగాలిమెట్ట వద్ద ఆది వారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చిన్నారులు తేజ, మానసలకు ఆశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు.

ఆశ్రునయనాల మధ్య చిన్నారుల అంత్యక్రియలు

మహానంది, మే 10: పాణ్యం మండలం సుగాలిమెట్ట వద్ద ఆది వారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చిన్నారులు తేజ, మానసలకు ఆశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. సోమవారం సీతారామపురం గ్రామంలో చిన్నారులు తేజ, మానసల మృతదేహాలను బంధువులు భుజాలపై గ్రామ శివారులోని శ్మశాన వాటిక వద్దకు చేర్చారు. చిన్నారుల తల్లిదండ్రులు తమ పిల్లల మృతదేహాలను కడ చూపు చూసుకొని బోరున విలపించారు. అనంతరం చిన్నారులకు అంత్యక్రియలు నిర్వహించారు. 

Updated Date - 2021-05-11T05:28:00+05:30 IST