రావత్ దంపతుల అంతిమయాత్ర ప్రారంభం
ABN , First Publish Date - 2021-12-10T20:03:42+05:30 IST
న్యూఢిల్లీ: రావత్ దంపతుల అంతిమయాత్ర ప్రారంభమైంది. కామ్రాజ్ మార్గ్ లోని రావత్ నివాసం నుంచి వారి భౌతికకాయాలనుంచిన వాహనం ఢిల్లీ కంటోన్మెంట్లోని బ్రార్ స్క్వేర్లోని శ్మశానవాటికకు బయలుదేరింది.
న్యూఢిల్లీ: రావత్ దంపతుల అంతిమయాత్ర ప్రారంభమైంది. ఢిల్లీ కామ్రాజ్ మార్గ్ లోని రావత్ నివాసం నుంచి వారి భౌతికకాయాలనుంచిన వాహనం ఢిల్లీ కంటోన్మెంట్లోని బ్రార్ స్క్వేర్లోని శ్మశానవాటికకు బయలుదేరింది. ప్రజలు, నేతలు, సైనికులు పెద్ద సంఖ్యలో అంతిమయాత్రలో పాల్గొంటున్నారు. అంతకుముందు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు నేతలు రావత్ దంపతుల భౌతికకాయాలకు నివాళులర్పించారు.