పశువుల దాహార్తి తీర్చేందుకు గడ్డెన్నవాగు ప్రాజెక్టు నీటి విడుదల

ABN , First Publish Date - 2021-04-11T06:11:01+05:30 IST

సుద్దవాగు పరివాహక ప్రాంతాల్లోని పశువుల దాహార్తిని తీర్చేందుకు, చివరిదశలోనున్న పంటలకు తడులు అందించేందుకు గాను గడ్డెన్న వాగు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసినట్లుగా ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి వెల్లడించారు.

పశువుల దాహార్తి తీర్చేందుకు గడ్డెన్నవాగు ప్రాజెక్టు నీటి విడుదల
అధికారులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడుతున్న ముథోల్‌ ఎమ్మెల్యే

భైంసా, ఏప్రిల్‌ 10 : సుద్దవాగు పరివాహక ప్రాంతాల్లోని పశువుల దాహార్తిని తీర్చేందుకు, చివరిదశలోనున్న పంటలకు తడులు అందించేందుకు గాను గడ్డెన్న వాగు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసినట్లుగా ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి వెల్లడించారు. శనివారం గడ్డెన్నవాగు ప్రాజెక్టు వరద గేట్‌ నుంచి సుద్దవాగులోకి నీటిని విడుదల చేసిన సందర్బంగా స్థానిక ఆర్‌అండ్‌బీ విశ్రాంతి భవనంలో సమావేశం నిర్వహించి మాట్లాడారు. సుద్దవాగు పరివాహక ప్రాంత రైతుల విజ్ఞప్తి మేరకు ఉన్నతాధికారులకు సమస్యను వివరించి ప్రాజెక్టు నుంచి నీటి విడుదలకు చర్యలు చేపట్టామన్నారు. ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో భూగర్భజలాలు అడుగంటిపోయి నీటి ఇబ్బందులు అధికమయ్యా యన్నారు. చెరువులు, కుంటలు, వాగులు, వంకలు ఎండిపోయి సమస్యలు పెరిగాయన్నారు. సంబంధిత సమస్యల పరిష్కారం కోసం గాను ప్రాజెక్టు నుంచి నీటి విడుదల చేయడం జరిగిందన్నారు. ఇందులో నీటిపారుదలశాఖ ఈఈ రామరావ్‌తో పాటు గడ్డెన్నవాగు ప్రాజెక్టు అధికారులు, పట్టణ, డివిజన్‌ పరిధి లోని ఆయా ప్రాంతాల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-04-11T06:11:01+05:30 IST