గజ వాహనంపై చాముండేశ్వరీ దేవి

ABN , First Publish Date - 2021-06-18T03:33:22+05:30 IST

మండల పరిధిలోని గంగపట్నం చాముండేశ్వరీ అమ్మవారు గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

గజ వాహనంపై చాముండేశ్వరీ దేవి
గజవాహనంపై చాముండేశ్వరీ అమ్మవారు

ఇందుకూరుపేట, జూన్‌ 17 : మండల పరిధిలోని గంగపట్నం చాముండేశ్వరీ అమ్మవారు గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం చప్పర ఉత్సవం నిర్వహించారు. సాయంత్రం అమ్మవారిని విశేష పుష్పాలంకారంలో గజవాహనంపై గ్రామోత్సవం జరిపారు. కొవిడ్‌ నిబంధనల మేరకు ఉభయకర్తలు, ఆలయ అధికారులు ఈ వేడుకలను నిర్వహించారు. చిల్లర వారి సోదరులు ఉభయకర్తలుగా వ్యవహరించగా.. దండిగుంట శరత్‌నాయుడు, ఫణీంద్ర, ఆలయ చైర్మన్‌ కొండూరు కృష్ణారెడ్డి, సభ్యులు, పూజారులు సుధీర్‌స్వామి, అనిల్‌స్వామి ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. 

Updated Date - 2021-06-18T03:33:22+05:30 IST