ఏపీ రాజధాని అమరావతి అంశాన్ని లోక్‌సభలో ప్రస్తావించిన గల్లా జయదేవ్‌

ABN , First Publish Date - 2020-09-19T22:28:06+05:30 IST

ఏపీ రాజధాని అమరావతి అంశాన్ని లోక్‌సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ ప్రస్తావించారు. ఏపీ రాజధాని అంశాన్ని కేంద్ర జాబితాలో చేర్చాలని కోరారు. అమరావతిలో

ఏపీ రాజధాని అమరావతి అంశాన్ని లోక్‌సభలో ప్రస్తావించిన గల్లా జయదేవ్‌

ఢిల్లీ: ఏపీ రాజధాని అమరావతి అంశాన్ని లోక్‌సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ ప్రస్తావించారు. ఏపీ రాజధాని అంశాన్ని కేంద్ర జాబితాలో చేర్చాలని కోరారు. అమరావతిలో రూ. 41 వేల కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని, ఇప్పుడు రాజధానిని మార్చడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఆర్టికల్‌ 248 ప్రకారం కేంద్ర, రాష్ట్ర జాబితాల్లో లేని అంశాలపై పార్లమెంట్‌లో కేంద్రం చట్టం చేయవచ్చన్నారు. అమరావతి అంశంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని గల్లా జయదేవ్‌ కోరారు.

Updated Date - 2020-09-19T22:28:06+05:30 IST