ఘనంగా గ్యార్మీ వేడుకలు
ABN , First Publish Date - 2021-11-27T06:30:55+05:30 IST
ఘనంగా గ్యార్మీ వేడుకలు
ఈడుపుగల్లు (కంకిపాడు), నవంబరు 26 : గ్యార్మీ వేడుకలను భక్తుల భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవటం సంతోషకరమని కంకిపాడు మం డల పరిషత్ మాజీ అధ్యక్షుడు దేవినేని రాజా అన్నారు. మండలంలోని ఈడుపుగల్లులో శుక్ర వారం గ్యార్మీ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని రాజా మాట్లాడుతూ ప్రతి ఏటా గ్యార్మీ వేడుకలను భక్తులు ఘనంగా నిర్వహించు కోవడం జరుగుతుందన్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పి. ఇంది ర, మాదు వసంతరావు, షరీఫ్, శ్రీను, జకీర్, శివయ్య తదితరులు పాల్గొన్నారు.