గాంధీ ఆశ్రమంలో సర్వమత ప్రార్థనలు

ABN , First Publish Date - 2021-10-25T04:37:00+05:30 IST

మండలంలోని పల్లెపాడు పినాకినీ సత్యాగ్రహ గాంధీ ఆశ్రమంలో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఆదివారం సర్వమత ప్రార్థనలు జరిపారు.

గాంధీ ఆశ్రమంలో సర్వమత ప్రార్థనలు
గాంధీ ఆశ్రమంలో సర్వమత ప్రార్థనలు

ఇందుకూరుపేట, అక్టోబరు 24 : మండలంలోని పల్లెపాడు పినాకినీ సత్యాగ్రహ గాంధీ ఆశ్రమంలో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఆదివారం సర్వమత ప్రార్థనలు జరిపారు. కో కన్వీనర్‌ నెల్లూరు రవీంద్రరెడ్డి ఆధ్వర్యంలో హిందూ, ముస్లిం, క్రైస్తవ, బౌద్ధ, సిక్కు, తావోయిజం మతాలకు సంబంధించి ప్రార్థనలు నిర్వహించారు. ముందుగా మహాత్మాగాంధీ, పొణకా కనకమ్మ విగ్రహాలకు గణేశం దయాకర్‌రెడ్డి ఖాదీ వస్త్రం, నూలు మాలలు సమర్పించారు. అనంతరం విద్యార్థులకు గాంధీ ఆశయాల గురించి రవీంద్రరెడ్డి వివరించారు. కార్యక్రమంలో కోర్‌ కమిటీ సభ్యులు గంపల మంజుల, సొలింగర కన్నయ్య, సాయిమనోజ్‌,  విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-25T04:37:00+05:30 IST