దొంగల ముఠా అరెస్ట్‌

ABN , First Publish Date - 2021-03-14T00:16:34+05:30 IST

జిల్లాలో బ్యాటరీలను చోరీ చేస్తున్న దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్

దొంగల ముఠా అరెస్ట్‌

కామారెడ్డి: జిల్లాలో బ్యాటరీలను చోరీ చేస్తున్న దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. లింగంపేట్‌లో బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్ ఉంది. ఈ టవర్లకు వాడే 51 బ్యాటరీలను ఈ దొంగల ముఠా ఎత్తుకెళ్లింది. బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ముఠాపై పోలీసులు నిఘా పెట్టి పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ బ్యాటరీల విలువ దాదాపు రూ.4 లక్షలు ఉంటుందని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Read more