కూకట్‌పల్లి సామూహిక అత్యాచారం కేసులో పురోగతి

ABN , First Publish Date - 2020-10-16T21:09:20+05:30 IST

కూకట్‌పల్లి సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. కేక్‌లో మత్తు మందు ఇచ్చి యువతిపై ముగ్గురు యువకులు అత్యాచారం చేశారు.

కూకట్‌పల్లి సామూహిక అత్యాచారం కేసులో పురోగతి

హైదరాబాద్: కూకట్‌పల్లి సామూహిక అత్యాచారం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. కేక్‌లో మత్తు మందు ఇచ్చి యువతిపై ముగ్గురు యువకులు అత్యాచారం చేశారు. నిందితులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. నిందితుల నుంచి మరిన్ని వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. కూకట్‌పల్లిలో స్నేహం ముసుగులో యువతిని ముగ్గురు  అత్యాచారం చేశారు. యువతిని జూబ్లీహిల్స్‌కు చెందిన డిగ్రీ విద్యార్థిగా గుర్తించారు. బర్త్‌డే కేకులో మత్తు మందు కలిపి యువతిపై అత్యాచారం చేసినట్లు విచారణ తేలింది. విషయం బయటకు చెబితే చంపేస్తామంటూ యువతిని యువకులు బెదిరించారు. బాధితురాలికి అస్వస్థతకు గురైంది. దీంతో ఆమె తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రులు నిలదీయండంతో జరిగిన విషయాన్ని ఆ యువతి చెప్పింది. నిందితులు జోసెఫ్‌, రాము, నవీన్‌పై పీఎస్‌లో తల్లిదండ్రుల ఫిర్యాదు చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-10-16T21:09:20+05:30 IST