కన్నుల పండువగా గంగమ్మ జాతర మహోత్సవం
ABN , First Publish Date - 2021-07-30T05:06:57+05:30 IST
మండలంలోని మాధవరం-1 పంచాయతీ పార్వతీపురం గ్రామంలో వెలసిన శీతల గంగమ్మ జాతర ఉత్సవాలు గురువారం వైభవంగా జరిగాయి.
సిద్దవటం, జూలై 29 : మండలంలోని మాధవరం-1 పంచాయతీ పార్వతీపురం గ్రామంలో వెలసిన శీతల గంగమ్మ జాతర ఉత్సవాలు గురువారం వైభవంగా జరిగాయి. ఉత్సవాల్లో సిద్దవటం, భాకరాపేట, ఒంటిమిట్ట తదితర ప్రాంతాల నుంచి భక్తులు మాధవరం గ్రామానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు తీర్థప్రసాదాలు అందజేశారు. జాతర మహోత్సవంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్రాయులు పాల్గొన్నారు. ఆయన స్థానిక టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం బత్యాల అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు ఎన్ఆర్ చలపాటి చంద్ర, గంజి సుబ్బరాయుడు, జింకా శివ, డాక్టర్ వీరభద్రుడు తదితరులు పాల్గొన్నారు.