గంగాపూర్ జాతర ఆదాయం రూ.29,48,192
ABN , First Publish Date - 2021-03-03T05:01:26+05:30 IST
రెబ్బెన మండలంలోని గంగాపూర్ ఆలయానికి జాతర ద్వారా రూ.29,48,192 ఆదాయం సమకూరిందని ఆలయ కమిటీ చైర్మన్ వెంకటేష్ తెలిపారు.
రెబ్బెన, మార్చి2: రెబ్బెన మండలంలోని గంగాపూర్ ఆలయానికి జాతర ద్వారా రూ.29,48,192 ఆదాయం సమకూరిందని ఆలయ కమిటీ చైర్మన్ వెంకటేష్ తెలిపారు. వేలం పాటల ద్వారా రూ.12,34,000 ఆదాయం రాగా, రశీదుల ద్వారా రూ.5,26,000, హుండీల ద్వారా రూ.11,88,192 ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు.