నెల్లూరు గాంధీనగర్‌లో ఆకతాయిల బీభత్సం

ABN , First Publish Date - 2020-05-27T16:08:04+05:30 IST

నెల్లూరు గాంధీనగర్‌లో ఆకతాయిల బీభత్సం సృష్టించారు.

నెల్లూరు గాంధీనగర్‌లో ఆకతాయిల బీభత్సం

నెల్లూరు: గాంధీనగర్‌లో ఆకతాయిలు బీభత్సం సృష్టించారు. రెడ్ జోన్ ప్రాంతంలోని మున్సిపల్ స్కూల్లో మందుపార్టీ చేసుకున్నారు. ప్రశ్నించిన స్థానికులపై రాళ్లతో దాడి చేశారు. ఆలయ ఆవరణలో మద్యం సీసాలు పగలగొడుతూ గందరగోళం సృష్టించారు. దీంతో పలువురు గాయపడ్డారు. ఘటన జరిగిన ప్రాంతంలోనే మంత్రి మేకపాటి గౌతంరెడ్డి నివాసం కూడా ఉంది. కొన్ని రోజులుగా గాందీనగర్‌లో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. పాఠశాలల్లో మందుకొడుతూ హల్ చల్ చేస్తున్నారు. పక్కనే ఉన్న ఆలయంలోనూ  వీరంగం సృష్టిస్తున్నారు. 


మందుబాబుల ఆగడాలపై స్థానికులు కొందరు వీడియోలు తీశారు. దీంతో ఆకతాయిలంతా మూకుమ్మడిగా దౌర్జన్యానికి పాల్పడ్డారు. రాళ్లతో దాడి చేయడంతో పలువురికి గాయాలు అయ్యాయి. ఆకతాయిల చేష్టలతో స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపించారు. ఇప్పటికైనా ఆకతాయిల అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.

Updated Date - 2020-05-27T16:08:04+05:30 IST