హైదరాబాద్‌ నుంచి గ్యాంగ్‌స్టర్‌ పరారీ..?

ABN , First Publish Date - 2021-04-13T16:08:49+05:30 IST

ఒడిశా రాజధాని నుంచి తప్పించుకుని నగరానికి చేరుకున్న గ్యాంగ్‌స్టర్‌ ఇక్కడి నుంచి

హైదరాబాద్‌ నుంచి గ్యాంగ్‌స్టర్‌ పరారీ..?

 హైదరాబాద్‌ : ఒడిశా రాజధాని నుంచి తప్పించుకుని నగరానికి చేరుకున్న గ్యాంగ్‌స్టర్‌ ఇక్కడి నుంచి కూడా పారిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మూడు రోజుల క్రితం ఒడిశా పోలీసులను తప్పుదోవ పట్టించడంతోపాటు ఓ కానిస్టేబుల్‌ను గాయపరిచి  గ్యాంగ్‌స్టర్‌ హైదర్‌ తప్పించుకున్న సంగతి విదితమే. అతను ప్రయాణించిన తెలుపు స్విఫ్ట్‌ కారు ఆనవాళ్లను నగరంలోని ఓ ప్రదేశంలో పోలీసులు సీసీ ఫుటేజీ ద్వారా గమనించారు.


రాత్రి 8.42 గంటలకు కారును గుర్తించిన పోలీసులకు ఆ తర్వాత కారు ఆనవాళ్లు కనిపించలేదు. వెంటనే అన్ని పోలీస్‌స్టేష న్లను అప్రమత్తం చేసినప్పటికీ గ్యాంగ్‌స్టర్‌ తప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ హైదరాబాద్‌లో నిందితుని స్విఫ్ట్‌ కారు ఉండి ఉంటే ఇప్పటికే పట్టుకునే వారమని నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. అతను ఇక్కడి నుంచి కూడా తప్పించుకుని.. కర్ణాటక లేదా మహారాష్ట్రలో తలదాచుకుని ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కారు నెంబర్‌ను మార్చడం లేదా... కారు మార్చి పారిపోయి ఉంటాడనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 

Updated Date - 2021-04-13T16:08:49+05:30 IST