దావూద్ ఇబ్రహీం సన్నిహిత గ్యాంగ్‌స్టర్ ఫహీం మఛ్మఛ్ మృతి!

ABN , First Publish Date - 2021-08-29T12:55:39+05:30 IST

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు అత్యంత...

దావూద్ ఇబ్రహీం సన్నిహిత గ్యాంగ్‌స్టర్ ఫహీం మఛ్మఛ్ మృతి!

ముంబై: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు అత్యంత సన్నిహితుడైన గ్యాంగ్‌స్టర్ ఫహీం మఛ్మఛ్ మృతి చెందాడు. ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఫహీం మఛ్మఛ్(51) కరోనా వైరస్ బారిన పడ్డాడు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఫహీం మఛ్మఛ్... పాకిస్తాన్‌లోని కరాచీలోగల ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. 


ఈయనపై పలు హత్య కేసులతో పాటు బెదిరింపు కేసులు, ఇతర నేరాలకు సంబంధించిన కేసులు ముంబైతో పాటు పలు నగరాల్లో నమోదయ్యాయి. ఈ నేపధ్యంలో పోలీసులు ఫహీం మఛ్మఛ్ కోసం గాలిస్తున్నారు. ఫహీం మఛ్మఛ్ దక్షిణ ముంబైలోని భిండీ బజార్ పరిధిలోని పెరూ లేన్‌లో ఉండేవాడు. దావూద్‌తో పాటు ఛోటా షకీల్‌కు సన్నిహితునిగా పేరొందాడు. గడచిన ఏడేళ్లుగా ఫహీం మఛ్మఛ్... దావూద్‌తో పాటు పాకిస్తాన్‌లో ఉంటున్నాడు.

Updated Date - 2021-08-29T12:55:39+05:30 IST