ఎన్‌కౌంటర్‌‌లో గాయపడి, పట్టుబడిన గ్యాంగ్‌స్టర్‌

ABN , First Publish Date - 2020-06-05T20:07:35+05:30 IST

పలు నేరసంబంధిత కేసుల్లో వాంటెడ్‌గా ఉన్న గ్యాంగ్‌స్టర్ భాటిని ఉత్తరప్రదేశ్ పోలీసులు శుక్రవారంనాడు పట్టుకున్నారు. గౌతం బుధ్ నగర్‌లోని..

ఎన్‌కౌంటర్‌‌లో గాయపడి, పట్టుబడిన గ్యాంగ్‌స్టర్‌

గౌతం బుధ్ నగర్: పలు నేరసంబంధిత కేసుల్లో వాంటెడ్‌గా ఉన్న గ్యాంగ్‌స్టర్ భాటిని ఉత్తరప్రదేశ్ పోలీసులు శుక్రవారంనాడు పట్టుకున్నారు. గౌతం బుధ్ నగర్‌లోని చక్రసేన్‌పూర్ రోడ్డులో జరిగిన ఎన్‌కౌంటర్ అనంతరం భాటీని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు.


క్రిమినల్స్‌కూ, గ్రేటర్ నొయిడా, దాద్రి పోలీసులకు మధ్య ఎన్‌కౌంటర్ చోటుచేసుకుందని, బుల్లెట్‌తో గాయాలపాలైన భాటిని అదుపులోనికి తీసుకుని జిల్లా ఆసుపత్రికి తరలించామని జోన్-3 డీడీపీ రాజేష్ కుమార్ తెలిపారు. అతని వద్ద నుంచి రూ.25,000 సొమ్ము కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. భాటి అనుచరుడు మాత్రం తప్పించుకున్నట్టు తెలిపారు. కొద్ది రోజుల క్రితం ట్రక్కు డ్రైవర్ల నుంచి లూటీ చేసిన మొబైల్ ఫోన్లలో ఒక ఫోను, బైకు, నాటుతుపాకీ పట్టుబడిన గ్యాంగ్‌స్టర్‌ నుంచి స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.

Updated Date - 2020-06-05T20:07:35+05:30 IST