హుజురాబాద్లో కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కుల పంపిణీ
ABN , First Publish Date - 2021-06-14T17:27:16+05:30 IST
హుజురాబాద్లో కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు.
కరీంనగర్ జిల్లా: కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం హుజురాబాద్లో మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగాలంటే సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు జీవించాలన్నారు. కొంత మంది నాయకులు కల్యాణ లక్ష్మీ, షాది ముబారక్, కేసీఆర్ కిట్ పథకాలు అవసరం లేదన్నారని.. ఆ పథకాలు కొనసాగించాలా.. వద్దా అనేది ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. నాటి ప్రభుత్వాలు వెనుకబడిన వర్గాలకు పూర్తి స్థాయిలో విద్యను అందించలేదని విమర్శించారు. ఇవాళ సీఎం కేసీఆర్ వారి కోసం 260 గురుకులాలు స్థాపించారని కొనియాడారు. తెలంగాణ అడబిడ్డలు నవ్వితే కేసీఆర్ ఆనంద పడతారని మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యానించారు.