బాగా ఆడడం కాదు.. గెలవాలి!
ABN , First Publish Date - 2020-07-13T09:03:47+05:30 IST
గత పర్యటనతో పోలిస్తే ఈసారి ఆస్ట్రేలియా టూర్ కఠినంగా ఉండనుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నాడు...
కోహ్లీకి చెప్పిన గంగూలీ
న్యూఢిల్లీ: గత పర్యటనతో పోలిస్తే ఈసారి ఆస్ట్రేలియా టూర్ కఠినంగా ఉండనుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నాడు. అందుకే ఆ మధ్య విరాట్ కోహ్లీతో మాట్లాడినప్పుడు ‘ఎవరికీ సాధ్యం కాని దాన్ని నీవు సాధించావు. దాన్ని నిలబెట్టుకోవాలి. బాగా ఆడడం కాదు.. విజేతగా నిలవాలి’ అని చెప్పినట్టు దాదా తెలిపాడు. పటిష్ఠ ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై ఢీకొనడం కష్టమే కానీ, బ్యాటింగ్, బౌలింగ్లో పటిష్ఠంగా ఉన్న టీమిండియాపై తనకు నమ్మకం ఉందని గంగూలీ చెప్పాడు. ఇక, సౌరవ్ ఐసీసీ చైర్మన్ రేస్లో ఉన్నాడనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో తాను ఆ పదవి కోసం తొందరపడడం లేదని దాదా స్పష్టత ఇచ్చాడు.