గంజాయి విక్రయించిన ఐదుగురి అరెస్టు
ABN , First Publish Date - 2021-11-03T14:32:37+05:30 IST
కాలేజీ విద్యార్థులతో పాటు మరికొందరికి గంజాయి వంటి మత్తు పదార్ధాలను విక్రయించిన కేసులో ఐదుగురిని నగర పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక తిరువొట్రియూరులో గంజాయి విక్రయాలు జోరుగా
అడయార్(Chennai): కాలేజీ విద్యార్థులతో పాటు మరికొందరికి గంజాయి వంటి మత్తు పదార్ధాలను విక్రయించిన కేసులో ఐదుగురిని నగర పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక తిరువొట్రియూరులో గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో వాషర్మెన్ పోలీస్ డిప్యూటీ కమిషనర్ శివప్రసాద్ ఆదేశం మేరకు ప్రత్యేక బృందం పోలీసులు ఆ ప్రాంతంలో నిఘా వేసింది. ఈ ప్రత్యేక బృందం నిఘాలో గంజాయి ప్యాకెట్తో వచ్చిన ఒక యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించగా, ఆ యువకుడిని తిరువొత్తియూరుకు చెందిన సూర్య(24)గా గుర్తించారు. ఈ యువకుడు ఇచ్చిన సమాచారం మేరకు అదే ప్రాంతానికి చెందిన శివకుమార్(28), కృష్ణన్(35), మన్నడికి చెందిన మహ్మద్ యాహియా(52), పెరంగళత్తూరుకు చెందిన అన్సారీ (42)లను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి గంజాయితో పాటు నైట్రావిడ్ మాత్రలను కూడా స్వాధీనం చేసుకున్నారు. వీరిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.