32 కిలోల గంజాయి పట్టివేత

ABN , First Publish Date - 2021-08-02T05:36:37+05:30 IST

ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న 32 కిలోలు గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఇరువురు నిందితులను పట్టుకున్నట్లు ఎస్‌ఈబీ ఇన్‌స్పెక్టర్‌ లత తెలిపారు.

32 కిలోల గంజాయి పట్టివేత
నిందితులతో పాటు గంజాయిని చూపుతున్న ఎస్‌ఈబీ అధికారులు

ఆర్టీసీ బస్సులో రవాణా చేస్తుండగా స్వాధీనం

ఇరువురు నిందితుల అరెస్టు

ఒంగోలు(క్రైం), ఆగస్టు 1: ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న 32 కిలోలు గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఇరువురు నిందితులను పట్టుకున్నట్లు ఎస్‌ఈబీ ఇన్‌స్పెక్టర్‌ లత తెలిపారు. ఆదివారం తెల్లవా రుజామున ఒంగోలులోని ఆర్టీసీ బస్టాండ్‌లో ఎస్‌ఈబీ అధికారులు త నిఖీలు నిర్వంహిచారు. విజయవాడ నుంచి నెల్లూరు వెళుతున్న వాకా డ డిపోకు చెందిన బస్సులో ట్రావెల్స్‌ బ్యాగ్‌లో గంజాయి ప్యాకెట్లు ఉంచి నర్సిపట్నం నుంచి తమిళనాడు రాష్ట్రంలోని తిరుపూర్‌కు తరలి స్తున్నారు. ఈక్రమంలో జరిగిన తనిఖీలలో తిరుపూర్‌కు చెందిన రా జు, జ్వోతిలను అదుపులోకి తీసుకొని వారి వద్ద 32 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసినట్లు లత తెలిపారు. ఈ తనిఖీలలో అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ ఎం.సుధీ ర్‌బాబు, ఎస్సై గోపాలకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-08-02T05:36:37+05:30 IST