15 కిలోల గంజాయి స్వాధీనం

ABN , First Publish Date - 2020-12-05T05:35:23+05:30 IST

ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న పది హేను కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని ముగ్గురు మహిళలను అరెస్టు చేశారు.

15 కిలోల గంజాయి స్వాధీనం
పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి

ముగ్గురు మహిళలు అరెస్టు

తాటిచెట్లపాలెం, డిసెంబరు 4: ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న పది హేను కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని ముగ్గురు మహిళలను అరెస్టు చేశారు. ఎయిర్‌పోర్టు జోన్‌ స్టేషన్‌ సీఐ సిహెచ్‌.ఉమాకాంత్‌ తెలిపిన వివరాల మేరకు...చింతపల్లికి చెందిన మణికుమారి, స్వాతి, పార్వతమ్మలు నర్సీపట్నం నుంచి బస్సులో నగరానికి వస్తున్నారు. వీరివద్ద గంజాయి ఉందన్న సమాచార మేరకు స్పెషల్‌ బ్రాంచి పోలీసులతో కలిసి తనిఖీలు నిర్వహించారు. ముగ్గురు మహిళల బ్యాగుల్లో అనుమానిత ప్యాకెట్లు కనిపించగా ప్రశ్నించామని, వారు సరైన సమాధానం చెప్పక పోవడంతో తెరవగా గంజాయి బయటపడిందని సీఐ తెలిపారు. సరుకు స్వాధీనం చేసుకుని ముగ్గురు మహిళలను అరెస్టు చేసినట్లు తెలిపారు. 

 

Updated Date - 2020-12-05T05:35:23+05:30 IST