పట్టుబడిన గంజాయితో నిందితులు

ABN , First Publish Date - 2021-02-24T05:02:02+05:30 IST

భద్రాచలంలోని అటవీ శాఖ చెక్‌పోస్టు వద్ద మంగళవారం రూ.4.20 లక్షలు విలువైన 28 కేజీల గంజాయిని భద్రాచలం పోలీసులు పట్టుకున్నారు.

పట్టుబడిన గంజాయితో నిందితులు
పట్టుబడిన గంజాయితో నిందితులు

రూ.4.20 లక్షలు విలువైన గంజాయి పట్టివేత

భద్రాచలం, ఫిబ్రవరి 23: భద్రాచలంలోని అటవీ శాఖ చెక్‌పోస్టు వద్ద మంగళవారం రూ.4.20 లక్షలు విలువైన 28 కేజీల గంజాయిని భద్రాచలం పోలీసులు పట్టుకున్నారు. ఉదయం భద్రాచలం సీఐ టి.స్వామి, ఎస్‌ఐలు వి.వెంకటేశ్వరరావు, బి.సాయికిషోర్‌రెడ్డి సిబ్బందితో అటవీ శాఖ చెక్‌పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా రెండు ద్విచక్రవాహనాలపై ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా సారపాక వైపు వెళ్తున్నారు. వారిని ఆపి సంచులను తనిఖీ చేయగా అందులో నిషేధిత గంజాయి ఉండటంతో వారిని స్టేషన్‌కు తరలించి విచారించారు. పట్టుబడిన వారిలో కొర్రా రవి, కిలో భగవాన్‌, కొర్ర రాజారావుతో పంగి బాలమ్మ అనే మహిళ ఉన్నారు. వీరందరూ విశాఖపట్టణానికి చెందిన వారని, గంజాయిని సీలేరు నుంచి హైదరాబాద్‌కు తీసుకెళ్తున్నట్లు విచారణలో తేలిందని సీఐ తెలిపారు. ఈ సందర్భంగా సీఐ స్వామి మాట్లాడుతూ పట్టణ సరిహద్దుల్లో 24 గంటల పాటు పోలీసుల తనిఖీలు కొనసాగుతుంటాయని నిషేధిత వస్తువులైన గంజాయి, ఇతర సామగ్రి తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.


Updated Date - 2021-02-24T05:02:02+05:30 IST