Gannavaram పంచాయితీ రేపటికి వాయిదా

ABN , First Publish Date - 2022-05-18T23:34:43+05:30 IST

గన్నవరం (Gannavaram) పంచాయితీని గురువారానికి వైసీపీ (YCP) అధిష్టానం వాయిదా వేసింది.

Gannavaram పంచాయితీ రేపటికి వాయిదా

అమరావతి: గన్నవరం (Gannavaram) పంచాయితీని గురువారానికి వైసీపీ (YCP) అధిష్టానం వాయిదా వేసింది. రేపు సాయంత్రం సీఎం క్యాంప్ ఆఫీసులో గన్నవరం పంచాయితీకి ముగింపు పలకాలని వైసీపీ భావించింది. అయితే ఆ పంచాయతీకి రేపు ముగింపు పలకాలని వైసీపీ పెద్దలు భావిస్తున్నారు. కొన్నిరోజులుగా ఎమ్మెల్యే వంశీ, దుట్టా రామచంద్రరావు మధ్య వర్గపోరు నడుస్తోంది. తారస్థాయికి చేరినందున ఈ వ్యవహారంపై అధిష్టానం దృష్టిసారించింది. సీఎం జగన్ నుంచి ఎమ్మెల్యే వంశీ (Vamsi), దుట్టా రామచంద్రరావుకు పిలుపు వచ్చింది.  సీఎంతో వంశీ, దుట్టా భేటీ కావాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో ఈ భేటీ వాయిదా పడింది.

Updated Date - 2022-05-18T23:34:43+05:30 IST