వైభవంగా గరుడసేవ
ABN , First Publish Date - 2021-10-21T07:14:19+05:30 IST
తిరుమలలో బుధవారం పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. ప్రతినెలా పౌర్ణమి రోజున గరుడసేవను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో బుధవారం రాత్రి 7 నుంచి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన మలయప్పస్వామి గరుడవాహనంపై మాడవీధుల్లో ఊరేగారు. భక్తుల గోవింద నామస్మరణలు, కర్పూర హారతుల నడుమ వాహనసేవ కనులపండువగా జరిగింది.
తిరుమలలో బుధవారం పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. ప్రతినెలా పౌర్ణమి రోజున గరుడసేవను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో బుధవారం రాత్రి 7 నుంచి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన మలయప్పస్వామి గరుడవాహనంపై మాడవీధుల్లో ఊరేగారు. భక్తుల గోవింద నామస్మరణలు, కర్పూర హారతుల నడుమ వాహనసేవ కనులపండువగా జరిగింది.
- తిరుమల, ఆంధ్రజ్యోతి